రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే జీ.ఎస్సా.ర్

శాయంపేట మండలం,31 మార్చి 2025
ఈరోజు సోమవారం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలోని సింగరకొండ రమేష్ గుప్తకు చెందిన రేషన్ షాపు నెం.19 వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రత కార్డు ఉన్న లబ్దిదారులకు మన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించ దగ్గ రోజుగా నిల్వనున్నదని ,దేశంలోనే తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని,దారిద్రరేఖకు దిగువనఉన్న పేదలతో పాటు మధ్య తరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80% ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ది చేకూరుతుందని,రాష్ట్రంలోని పేద ప్రజల ఆహారభద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు అనాసక్తత కనపరచడంతో పాటు దళారులకు అమ్ముకోవడం వలన పక్కదారి పడుతున్నాయని అన్నారు వీటన్నింటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి నిర్ణయం తీసుకుందని అన్నారు అర్హులందరికీ నూతన రేషన్ కార్డులుఅందజేస్తామన్నారు. పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.అనంతరం 32 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.10,63,500/-విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పరకాల ఆర్డీఓ,శాయంపేట ఎమ్మార్వో  రేషన్ డీలర్ మండల అధ్యక్షుడు  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు . ప్రజలు పాల్గొన్నారు 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post