రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టి, బీసీ నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది .నిరుద్యోగ యువత కు రాజీవ్ యువ వికాస పథకం పేరుతో ఉపాధి అవకాశాలు కల్పించాలనిరాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ వచ్చేనెల 5వ తేదీ వరకు tgobmms.cgg.gov.in వెబ్ సైటు ద్వారా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని బిసి కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కోసం ఇతర వివరాలు సంబంధిత వెబ్ సైటు లో ఉంటాయని వెల్లడించారు. ఇతర వివరాల కోసం జిల్లా బిసి వెల్ఫేర్ ఆఫీసును సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చింది దీని ద్వారా ఒక్కో లబ్ధిదారునికి గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజీవ్ యువ వికాసంనేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
byBLN TELUGU NEWS
-
0
Post a Comment