10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు,పెన్సిల్

పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరకాల నియోజక వర్గం నడికూడ మండల కేంద్రంలోని నార్లపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సమాచార హక్కు రక్షణ చట్టం పరకాల అధ్యక్షుడు నేరెళ్ళ అనిల్ గౌడ్ 10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు,పెన్సిల్ అందజేశారు.అనంతరం అనిల్ గౌడ్ మాట్లాడుతూ మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. నర్సంపేట ఆర్టీఐ ఉపాధ్యక్షుడు రొట్టె సురేష్ మాట్లాడుతూ విద్యార్థులను క్రమశిక్షణ తో వుండాలని తెలియజేశారు.నర్సంపేట ఆర్టీఐ ప్రధాన కార్యదర్శి వల్లే రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లి దండ్రుల , ఉపాధ్యాయులు ఆశయాలను ,నెరవేర్చాలని కోరారు. నర్సంపేట ఆర్టీఐ మాజీ యూత్ కన్వీనర్ అడ్డ సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పింది తుచ తప్పకుండా పాటించాలని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్ లో ఉపాధ్యాయుల గర్వించే స్థాయి లో వుండాలని కోరారు. నర్సంపేట ఆర్టీఐ ప్రధాన కార్యదర్శి వల్లే రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లి దండ్రుల , ఉపాధ్యాయులు ఆశయాలను ,నెరవేర్చాలని కోరారు.ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు సాయం చేసినందుకు సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని మాట్లాడారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post