తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు
దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వారు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే.. రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వారు మీసేవ సెంటర్లకు తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇది వరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.50 మాత్రమే చెల్లించాలి. ఎవరైనా అంతకంటే ఎక్కువగా తీసుకుంటే ఫిర్యాదు కూడా చేయవచ్చు.
Post a Comment