హత్య కేసు ఛేదించిన పోలీసులకి సన్మానం

శాయంపేట మండలం ఆరెపల్లె గ్రామానికి చెందిన బొందమ్మ అనే మహిళను ధర్మారం దగ్గర హత్య చేసిన సంఘటన 2023లో జరిగిందని సీఐ రంజిత్ రావు తెలిపారు. సీఐ తెలిపిన ఈ కేసు వివరాలు ఇలా వున్నాయి... శాయంపేట మండలం ఆరెపల్లె గ్రామానికి చెందిన బొందమ్మ అనే మహిళను అదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి అనే వ్యక్తి హత్య చేశాడని తెలిపారు. ఈ కేసు ని పరకాల ఏసిపి సతీష్ బాబు, సెంట్రల్ జోన్ డిసిపి రవీందర్ విచారణ చేపట్టారు. ఈ కేసు విషయంలో వరంగల్ సిపి పరకాల సిఐ కి సిఫార్సు చేయగా, ఈ కేసులో పరకాల రూరల్ సిఐ రంజిత్ రావు, శాయంపేట ఎస్సై జక్కల పరమేష్, దామెర ఎస్సై అశోక్, ఏఎస్ఐ రాజు, కానిస్టేబుల్ సతీష్, అశోక్ లు సాంకేతిక పరమైన ఆధారాలతో కేసును చేధించి, నేరస్తుడు రాజిరెడ్డిని పట్టుకొని పరకాల సీఐ కి అప్పచెప్పామని సీఐ తెలిపారు.
ఈ హత్య కేసుని ఛేదించిన శాయంపేట పోలీసులకు, మృతురాలు బొందమ్మ కుమారుడు వడికాల రాజేశ్వరరావు, కోడలు జ్యోతి మంగళవారం పోలీస్ స్టేషన్లో సీఐ రంజిత్ రావు, ఎస్పై పరమేష్, కానిస్టేబుల్ సతీష్ కు శాలువతో సన్మానం చేసి, స్వీట్లు తినిపించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు అడప ప్రభాకర్, పగడాల కృష్ణయ్య, దామర కొండ కొమురయ్య, ఫాస్టరు సదానందం, నగిలేగాని విజేందర్, బూరుగుల దేవరాజ్, గంగుల కృష్ణారెడ్డి పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post