వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లో రైతులు అధికంగా మిర్చి పంట సాగు చేసేవారు గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి నల్లి తామర పురుగులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సంస్థ, ఉధ్యానవన పంటలు పండించే రైతులకోసం పరిశోదనా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని తెలిసిన రైతులు మా పంటలకు ఆశించ చీడ పీడ పురుగుల నుండి ఒక శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుందని సంతోషపడ్డారు కానీ వారి సంతోషం మున్నాళ ముచ్చటగా మారింది. వరంగల్ జిల్లాలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆనాటి ప్రభుత్వం ప్రత్యేకంగా హర్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (మిర్చి పరిశోదన కేంద్రం మరియు సీడ్స్ అండ్ స్పైసెస్) ని నల్లబెల్లి మండలంలోని కన్నారావు పేట గ్రామంలో ఏర్పాటుకు G.O - 31 ద్వారా హార్టి కల్చర్ మంజూరి కావటం జరిగింది.దీనికి గాను కన్నారావుపేట గ్రామ శివారు లో సర్వే నంబర్ 58 లోని 54ఎకరాల భూమిని సేకరించి అప్పటి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ హర్టికల్చర్ యూనివర్సిటీ వారికి అందజేయడం జరిగింది.హర్టికల్చర్ సెంటర్ ను గత ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హార్టికల్చర్ రీసెర్చ్ శాస్త్రవేత్త కే భాస్కర్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.కానీ పనులు ప్రారంభించలేదు.ఎన్నికల ముందు హడావిడిగా ఎందుకు ప్రారంభించారు.
నూతన ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సరం గడుస్తున్నా సదరు రిసెర్చ్ స్టేషన్ కు సంబందించిన విషయంలో ఎలాంటి పురోగతి గాని,సమీక్షలు గానీ జరిపింది లేదు..పనులు ముందుకు సాగకపోవటం భాధాకరం.దాదాపు సంవత్సరం వృదా అయ్యింది.వీలైనంత త్వరగా తదుపరి చర్యలు చేపట్టి,వరంగల్ జిల్లా రైతాంగానికి మిర్చి పరిశోదన కేంద్రంతో పాటు,సీడ్స్,స్పైసెస్ కు సంబందించిన అన్ని రకాల పరిశోదనల ఏకైక కేంద్రం రాష్ట్రంలో నర్సంపేట నియోజిక వర్గ లో వుంటే రైతులకు మేలు జరుగుతుందిఅనుకున్నారు.ప్రభుత్వం..రైతులకు,వ్యవసాయానికి ఉపయోగపడే హర్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సంబందించి తదుపరి చర్యలు చేపట్టి వేగంగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. రాజకీయ కక్షలకు పోకుండా ఆర్టికల్చర్ సెంటర్ పనులు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ మండలం లో పడితే విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి కనుక ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకొని రైతులకు అండగా నిలవాలని రైతులు మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారుగత ప్రభుత్వం లో హార్టీ కల్చర్ సెంటర్ ప్రకటించి ప్రారంభంచిదం తో తామర పురుగు తో నష్ట పోతున్న మా రైతులకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం కానీ హర్టీ కల్చర్ సెంటర్ పనులు ఇంకా ప్రారంభం కాకపోయేసరికి రైతులకు నిరాశే ఎదురైంది.ఇప్పటికైనా హర్టి కల్చర్ సెంటర్ ప్రారంభించి మా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
రైతు
గత నాలుగు సంవత్సరాలు గా మిర్చి పంట సాగు చేసి తామర పురుగుతో నష్ట పోయిన ఆర్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మాకు పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం రైతు రమేష్ యాదవ్ అన్నారు
Post a Comment