ములుగుతునికాకు సేకరణ టెండర్లు పిలవాలి - లక్షల మంది ఉపాధి కాపాడాలి

గిరిజనులు, పేదలకు తునికాకు సేకరణ ఉపాధిని కల్పిస్తున్నది. ప్రతిఏటా డిసెంబర్, జనవరి నుంచే సేకరణ ప్రక్రియకు సంబంధించిన పనులను అటవీశాఖ మొదలు పెట్టేది. ఈ ఏడాది మాత్రం అ ప్రక్రియ నత్తనడక ను తలపిస్తున్నది. ఇప్పటిదారా టెండ ర్ల ప్రక్రియనే పూర్తవ్వలేదు. కొమ్మకొట్టుడు (పూనింగ్) ప్రక్రియను మొదలు పెట్టలేదు. టెండర్లను పూనింగ్ ప్రక్రియలను సకాలంలోచే పట్టకుంటే లక్షలాది మంది పేదల ఉపాధికి గండి పడే అవకాశముంది. తునికాకు సేకరణ పనుల జాప్యంతో దీనిపై ఆధారపడిన ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరులు ఆందోళనలో ఉన్నారు.
ఫిబ్రవరి మొదటివారం నడుస్తున్నప్పటికీ, నేటికీ తునికాకు టెండర్లు పూర్తికాలేదు. లక్షలాదిమంది ప్రజల ఉపాధి దెబ్బతినే టట్లున్నది. ఈపాటికే పూసింగ్ పనులు చేపట్టవలసిన అవసరం ఉన్నది. కావున ఎజెన్సీ ప్రాంతాల్లో, తునికాకు దొరికే ప్రాంతాల్లో, B కార్మికుల ఉపాధి కోల్పోకుండా తగిన చర్యలు చేపట్టగలరని కోరుతున్నాం. టెండర్లు నిర్వహించకపోతే, మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా సరే నేరుగా ఆకు సేకరించవచ్చు. ఈ రెండిటిలో ఏదో ఒకటి సత్వరమే నిర్ణయం తీసుకొని పది రోజుల్లో ప్రూనింగ్ పనులు ప్రారం భించాలని కోరుతున్నము. 

దుగ్గి చిరంజీవి 
జిల్లా అధ్యక్షులు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post