కొప్పుల గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్.

శాయంపేట మండలం, 17 ఫిబ్రవరి 2025:
భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మూడు రోజుల నుండి పండుగ వాతావరణంలో శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ సమేత సీతలాంబ(బొడ్రాయి) మరియు శ్రీ పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కాగా, ఈరోజు సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రతిష్ఠాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు అర్చకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, కాంగ్రెస్ నేతలు డప్పుచప్పుళ్లు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీలక్ష్మీ, భూలక్ష్మీ సమేత సీతలాంబ(బొడ్రాయి) మరియు శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కొప్పుల గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే 

 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post