BLN తెలుగు దినపత్రిక: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పరిధిలోని భూపాలపల్లి రేంజ్, దూదేకుల పల్లి రేంజ్ ఆఫీసర్స్ I. ఉష, రాం మూర్తి, భూపాలపల్లి రేంజ్, దూదేకుల పల్లి రేంజ్, ఆజంనగర్ రేంజ్ లలో రెండు రోజులు అటవీ మంటల నివారణ, పోడు వ్యవసాయం, వన్నె ప్రానులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేంజ్ ఆఫీసర్ I. Ushaఅవసరమైన నీరు మరియు వ్యవసాయానికి పంటల అభివృద్ధికి ప్రజల ఆహార ఉత్పత్తి పెరుగుతుంది. ప్రకృతిలో సంభవించే భూకంపాలు రాకుండా కాపాడుతుంది. జంతు సంపద అభివృద్ధి చెందుతాయి. అనేక ఆయుర్వేద ఔషధాలు అడవుల్లో లభిస్తాయి. అడవిలో చెట్లను కాపాడుకోవాలని పర్యావరణం ప్రకృతి బాగుంటుందని, అడవికి నిప్పు పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయని అడవులలో ఇప్పగింజలు, ఇప్పపువ్వు, చీపురు అనేక రకాల పండ్లు, రకరకాల చెట్లను నష్టపోతామని, భావితరాలకు ఉపయోగపడే ఎన్నో చెట్లను కోల్పోతామని, భూమి పైన పడిన విత్తనాలను కూడా కోల్పోతాము. మనం పెరిగే అడవులకు నష్టం కలిగించిన వారం అవుతాము. అడవుల్లో ఎన్నో రకాల జంతువులు, వన్యప్రాణులు ఉన్నాయి. పుచ్చులు పెట్టి వన్యప్రాణులను జంతువులను చంపకూడదు అడవులను నరికి వేయడం వల్ల, మనం నష్టపోతామని రెండు రోజులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో గ్రామ ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి రేంజ్ ఆఫీసర్, దూదేకులపల్లి రేంజ్ ఆఫీసర్, ఆజంనగర్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, బేస్ క్యాంప్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post a Comment