పరకాల”లోని ఓ మిల్లులో యధేచ్ఛగా గోల్ మాల్..!
రైతులే తమ పంటప్రయివేటుకు అమ్ముకునేలా ఆ మిల్లులో పక్కా ప్లాన్...
సీసీఐ కేంద్రాల్లో కొరవడిన అధికారుల నిఘా...
సిసిఐ అధికారులు, మిల్లు యజమాని మిలాఖాత్ తో యధేచ్ఛగా సాగుతున్న దందా....
CCI inligale marketing “సిసిఐ” కొర్రీలతోపంట ప్రయివేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాణ్యత లేమి, తేమ శాతం పేరుతో “పరకాల”లోని ఓ మిల్లులో యధేచ్ఛగా గోల్ మాల్ జరుగుతుందనే ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. పరకాల పట్టణం ఎంట్రీలో ఉండే ఆ మిల్లువైపు తొంగి చూసే అధికారే లేకపోవడం గమనార్హం. మరోవైపు సీసీఐ కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. దీంతో వారు పెట్టే కొర్రిలతో పంటను “ప్రయివేటు” కు అమ్ముకోవాల్సిన అనివార్య పరిస్థితులు రైతులకు ఏర్పడుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.ప్రయివేటు వ్యాపారులు పంటలను ఇష్టారీతిన
కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పత్తి
రైతులకు మద్దతు ధర కల్పించేందుకు భారత పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారనేది తెలిసిందే. కానీ.. ప్రభుత్వ ఉద్దేశం నెరవేరకపోగా పరిస్థితి భిన్నంగా మారుతోంది. మద్దతు ధర కోసం పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్తున్న రైతులు అక్కడే అదే జిన్నింగ్ మిల్లు యజమానికి అడ్డికి పావుశేరుకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఆశలతో పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. అడుగడుగునా నిబంధనలకు విరుద్ధంగానే తేమశాతం నిర్ధారణ యంత్రాలను ఉపయోగించి రిజక్టు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. కావాలని రైతులను ఇబ్బంది పెట్టి మరీ ఎట్టకేలకు మిల్లు ఓనర్లకు పంటను అమ్ముకునే విధంగా సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రచారంసాగుతోంది.
సీసీఐ కేంద్రాల వద్ద కొరవడిన నిఘా
CCI inligale marketing సీసీఐ కేంద్రాల్లో ప్రయివేటు దందాలో తేమ శాతం కొర్రీలను క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రభుత్వ అధికారులు కరువయ్యారు. వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఆయా జిన్నింగ్ మిల్లుల వద్ద ఉండి రైతుల సందేహాలను నివృత్తి చేయాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షణ చేసేందుకు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సైతం నిరంతరం పర్యవేక్షణ చేయాలి. వీరితోపాటు జిన్నింగ్ మిల్లుల సమీపంలోని మార్కెట్ కమిటీ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నిరంతరం పర్యవేక్షణ చేయాలి. కానీ కేవలం మార్కెట్ కమిటీకు చెందిన డేటా ఎంట్రీ ఆఫీసర్ మినహాయించి సీసీఐ కేంద్రాల్లో ఇతర అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అలా వచ్చామా, ఇలా వెళ్లామా సోషల్ మీడియాలో ఫొటో అప్లోడ్ చేశామా అన్నట్లు అధికారులు వచ్చిపోతున్నారని, తమ సమస్యలు వినే నాధుడు లేడని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.
Post a Comment