భూపాలపల్లి:ఇటీవల బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాల, మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని విజయం సాధించడం అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* అన్నారు. ఈరోజు గురువారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలో పాల్గొని విజయం సాధించి, భూపాలపల్లికి వచ్చిన విద్యార్థులు కందికట్ల వైష్ణవి, ఈరవేణి అంజలి, ఎండి రుజ్దా నైమా, గన్నంపల్లి హాసిని లకు ఎమ్మెల్యే శాలువాలు కప్పి, మెమెంటోలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన జిల్లా జాతీయస్థాయి సైకిల్ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడా పోటీల్లో రాణించాలని సూచించారు. సైక్లింగ్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ బోనాల రాజమౌళి విద్యార్థులకు సరైన సైకిళ్ళు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వారికి అవసరమైన సైకిళ్లను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమకూరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉన్నటువంటి క్రికెట్ కిట్లను కలెక్టర్ గారితో మాట్లాడి మండలంలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులకు త్వరలోనే పంపిణీ చేసేలా చూస్తానన్నారు. అనంతరం నేషనల్ సైక్లింగ్ కాంపిటీషన్ తెలంగాణ టీం కోచ్ గా వ్యవహరించిన జడ్.పి.హెచ్.ఎస్ పెద్దాపూర్ స్కూల్ పీడీ కూస మమత కు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో సైక్లింగ్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ బోనాల రాజమౌళి, జిల్లా స్పోర్ట్స్ అధికారి చిర్ర రఘు, సైక్లింగ్ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ చాగంటి ఆనంద్, కోశాధికారి సాంబరాజు తదితరులు ఉన్నారు
జాతీయస్థాయి సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటిన భూపాలపల్లి జిల్లా విద్యార్థులు...ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విద్యార్థులకు శాలువాలు కప్పి అభినందించిన ఎమ్మెల్యే జీఎస్సార్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment