తెలంగాణ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. 'అభయహస్తం' నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం కింద 2009-2016 మధ్య మహిళా సంఘాల సభ్యులు జమ చేసిన డబ్బుల్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల వారీగా లబ్ధిదారుల లిస్టును రెడీ చేస్తోంది. 60 ఏళ్లు దాటిన మహిళలకు రూ.500 పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను తీసుకురాగా, మహిళలు ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లించారు. 2018లో ఈ స్కీమ్ నిలిచిపోయింది. దీంతో వడ్డీతో కలిపి ఆ డబ్బును తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేయనుంది.
మహిళలకు శుభవార్త.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు..!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment