ఓ మహిళ కుమార్తె వివాహం అనంతరం పడిన కళ్యాణ లక్ష్మి సొమ్మును సిరిసిల్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు పంటరుణం కింద జమ చేసుకున్నారు.ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. ఆడబిడ్డ పెళ్లి చెయ్యడం కష్టం కావొద్దని, కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. అలాగే వచ్చిన కల్యాణలక్ష్మి లక్ష రూపాయలలో 60 వేలు బ్యాంకుకి, 40 వేలు లబ్ధిదారునికా?, నువ్వు నడిపేది ప్రభుత్వమా? రికవరీ ఏజెన్సీనా?అని నిలదీశారు. అంతేగాక అందరికీ రెండు లక్షల పంట రుణ మాఫీ చేసాము అని బాకాలు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని, సోంబాయి కన్నీటికి కారణం ఎవరు అని! ఆగ్రహం వ్యక్తం చేశారు.తనకు రావాల్సిన కల్యాణలక్ష్మి డబ్బులులో 60 వేలు ఎందుకు గుంజుకున్నారు అని!, తులం బంగారం అన్నారు.. ఆఖరికి కల్యాణలక్ష్మి డబ్బులులో కూడా కొర్రీలు పెడుతున్నారని* సంచలన విమర్శలు చేశారు. ఇక *దందాలు, వసూళ్లు మాత్రమే తెలిసిన రేవంత్ కి ఒక చిన్న సలహా! అంటూ.. కనీసం ఆడపిల్ల పెళ్లి డబ్బుల జోలికి పోవద్దు! అని మాజీ మంత్రి కేటిఆర్ చెప్పారు.
కళ్యాణ లక్ష్మిని వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదాఅని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? రికవరీ ఏజెన్సీ నడుపుతున్నారా?* అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
byBLN TELUGU NEWS
-
0
Post a Comment