పద్మ' పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష: సీఎం రేవంత్‌

పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. *గద్దర్‌, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే నన్నారు. తెలంగాణకు కనీసం ఐదు పురస్కారాలు కూడా ప్రకటించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post