తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మంద కృష్ణ మాదిగ అభినందనలు.
మంద కృష్ణ పద్మశ్రీ పురస్కారం రావడం మాదిగలకు, మాదిగ ఉపకులాలకు దక్కిన గౌరవం.
బీజేపీ ప్రభుత్వం పేదలు, మైనార్టీల పట్ల వివక్ష చూపుతోందిమత విద్వేషాలతో గొడవలు జరుగుతున్న దేశాలాలో భారత దేశం మొదటి స్థానంలో ఉంది..
దేశంలో పెరిగిన షెడ్యూల్ కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి.....
రాజ్యాంగ స్ఫూర్తికి, సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్ట బద్దత కల్పించాలి....
దేశంలో 4సంక్షేమ పథకాలను ఒకేసారి అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది...
రాష్ట్రంలో 4సంక్షేమ పథకాల ద్వారా 1కోటి మంది లబ్దిపొందానున్నారు..
ప్రతిపక్షాలు పసలేని, పనికిరాని విమర్శలు చేస్తున్నాయిబండి సంజయ్ తెలంగాణ నీ అయ్యా జాగీరు కాదు
కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు తెలంగాణపై ప్రేమ ఉంటే 10వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలి....
కేంద్ర ప్రభుత్వం పైనుండి ఊడి పడలేదు. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్ర ప్రభుత్వం
భారత దేశ ప్రజలందరి హక్కులను రక్షించే విధంగా ప్రపంచమలోనే అతిపెద్ద, గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు భారత రత్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారుస్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 76వ ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి జాతీయ పతకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారుఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ దేశ సమగ్రతను కాపాడటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తోడ్పడుతోందని అన్నారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలను, హక్కులను రాజ్యాంగం ప్రతింభిస్తుందని అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం దేశ పౌరులుగా ప్రతీ ఒక్కరిపై ఉందని సూచించారు. అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడిన రాజ్యాంగంపై దేశ ప్రజలకు ఎనలేని గౌరవం ఉందని అన్నారు. కొంత మంది రాజకీయ నాయకులు, పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. సెక్యులరిజం పేరుతో రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రయత్నం, ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా కులాల పేరుతో, మతాల పేరుతో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిని ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనలని కాపాడుతుందని కావున రాజ్యాంగాన్ని మనందరం కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగకు అభినందనలుసామాజిక ఉద్యమకారుడు, గత 30ఏళ్లుగా షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఎమ్మార్పిఎస్ ను స్థాపించి షెడ్యూల్ కూలాల అభివృద్ధికి పోరాడుతున్న మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారం రావడం మాదిగలకు, మాదిగ ఉప కులాలకు దక్కిన గౌరవం అని అన్నారు. ఈసందర్బంగా మంద కృష్ణ మాదిగ అభినందనలు తెలిపారు.
షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్ట బద్దత కల్పించాలి....
దేశంలో షెడ్యూల్ కూలాల రిజర్వేషన్లను 15శాతం నుండి 18శాతనికి పంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన ప్రకారం షెడ్యూల్ కూలాల జనాభా 18శాతం నుండి 19శాతం వరకు పెరిగిందని వెల్లడించారు. పెరిగిన షెడ్యూల్ కులాల జనాభా ఆధారంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు పెంచాలని అలాగే రాజ్యాంగ స్ఫూర్తికి, సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి షెడ్యూల్ కూలాల వర్గీకరణకు చట్టభద్దత కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల ద్వారా 1కోటి మంది లబ్దిపొందనున్నారని తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఒకేసారి 4సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ రోజు 4 సంక్షేమపథకాల ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించనున్నట్లు వివరించారు.మండలానికి ఒక గ్రామం చొప్పున అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ బండి సంజయ్ అయ్యా జాగీర్ కాదురాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వమని అంటున్న బండి సంజయ్ తెలంగాణ నీ అయ్యా జాగీర్ కాదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడనీ విమర్శించారు. కిషన్ రెడ్డి తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే పదివేల కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పైనుంచి ఏమీ ఊడిపడలేదని అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్ర ప్రభుత్వమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం మీ దయాదాక్షిన్యాల మీద ఏమీ ఆధారపడలేదని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే పన్నులు రాష్ట్రానికి ఇస్తే చాలని అన్నారుఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post a Comment