భూపాలపల్లిలో ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి..

గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
- గద్దర్ వర్ధంతి నాటికి భూపాలపల్లి మంజూరునగర్ సెంటర్లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే 

భూపాలపల్లి, 31 జనవరి 2025:
తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజా యుద్ధ నౌక గద్దర్(గుమ్మడి విఠల్)జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఈరోజు భూపాలపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుక గద్దర్ అని స్మరించుకున్నారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి పేరుతో అవార్డు నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూపాలపల్లి మంజూరునగర్ సెంటర్లో గద్దర్ విగ్రహాన్ని వారి వర్ధంతి(ఆగష్టు 6)నాటికి ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post