సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చవద్దు..గీత దాటితే వేటు తప్పదు డీజీపీ శివధర్ రెడ్డి

సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దని, సివిల్ వివాదా లను పరిష్కరించిన పోలీసు స్టేషన్లు, సంబంధిత అధికారుల పై తక్షణమే వేటు పడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు._
_హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకూ ఎవరూ సివిల్ వివాదాల్లో తల దూర్చవద్దని కోరుతూ రాష్ట్ర పోలీసులనుద్దేశించి రాసిన అంతర్గత లేఖలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. సివిల్ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయన్న సంగతి ప్రతి పోలీసుకూ తెలుసునని, అయినా వాటి పై దృష్టి సారించే అధికారుల పై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు..పోలీసు యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదన్న డీజీపీ.అవినీతి, అక్రమాల పై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుందని చెప్పారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post