మోసం చేసిన పారారిలో వున్న నిందితుల అరెస్ట్

శాయంపేట గ్రామానికి చెందిన మామిడి సదాశివ, సదానందం మరియు శ్రీదేవి ముగ్గురు కలిసి వారి అవసరాల నిమిత్తం శాంపేటలో వారికి ఉండబడిన ఇంటిని అమ్ముటకు నిర్ణయించుకొని దాని యొక్క విలువను 41,25,000 లకు గాను ధర నిర్ణయించుకొనగా అదే గ్రామానికి చెందిన బాల్నే తిలక్ బాబు భయనగా 15 లక్షల రూపాయలు పెద్దల సమక్షంలో ఇచ్చి మిగతా డబ్బులు రిస్ట్రేషన్ సమయంలో ఇచ్చుటకు అగ్రిమెంట్ చేసుకొని, రిజిస్టేషన్ చెయ్యకుండా బయనంగా ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసినారు అని అట్టి బాధతో బాల్నే తిలక్ బాబు గుండెపోటు తో చనిపోయినాడు అని అయినా కూడా సదురు నిందితులు భయానా డబ్బులు ఇవ్వడంలేదు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసినారు అని బాల్నే తిలక్ బాబు  భార్య బాల్నే కవిత  పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుల మూడు నెలల నుండి పారరిలో వున్నారని ఈరోజు నిందితురాలిని మామిడి శ్రీదేవి వల్ల ఇంటికి వచ్చినది అని సమాచారం రాగానే పోలోసులు మామిడి శ్రీదేవిని నిన్న అనగా తేదీ 23.09.2025 అదుపులోకి తీసుకొని రిమాండ్ నిమిత్తం పరకాల కోర్టులో హాజరు పరచినట్లు SI J. పరమేశ్వర్ తెలిపినారు.
పారారిలో వున్న మిగతా ఇద్దరి గురించి నిగా పెట్టి పారారిలో వున్న నేరస్తుడు హైదరాబాద్ లో వున్నాడని అని సమాచారం రాగ అక్కడికి వెళ్లి నేరస్తుడు మామిడి సదశివ ని పట్టుకొని రిమాండ్ నిమిత్తం పరకాల కోర్టు నందు హాజరు పరచినట్లు శాయంపేట SI J. పరమేశ్వర్  తెలిపినారు.
పైన తెలిపిన ముగ్గురు అదే సహాయంపేట గ్రామానికి చెందిన పురాణం రాజేందర్ అను అతడిని కూడా ఆన్లైలోనే పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుంది అని మోసం చేసారు అని పై ముగ్గురి మీద పురాణం రాజేందర్ ధరఖాస్తు ఇవ్వగా మరొక చీటింగ్ కేసు ఐనట్లు SI తెలిపినారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post