దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన మాచబోయిన ఓదేమ్మ వీల్ చైర్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. శారీరక లోపాలను అధిగమించి నేడు దివ్యాంగుల సైతం అన్ని రంగాల్లో దూసుకొని వెళ్తున్నారని తెలిపారు. ఆత్మవిశ్వాసానికి ప్రతీక దివ్యంగులని అన్నారు. నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post