ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్

బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే అండగా నిలవాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు కవితకు మద్దతు తెలపడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.
ఈ..సందర్భంగా పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... తనపై తెలంగాణ జాగృతి జరిపిన దాడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వాగతించలేదు.. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని* ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తుందని, ఇటీవల ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగినప్పుడే కవిత సైతం మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉండే ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలనిప్రశ్నించారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని జోస్యం చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆర్డినెన్స్ రాకంటే ముందే కవిత సంబరాలు చేయడం కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆమెకు అండగా నిలవడం చూస్తుంటే కవిత కాంగ్రెస్ మిలాఖత్ కావడం అని స్పష్టమవుతుందనిఅన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చీకటి ఒప్పందలతో దాడులు చేసిన బీసీ ఉద్యమం ఆగదని, తనపై దాడి జరిగితే తనపైనే కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డీసీపీకి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ విషయంపై బీసీ కమిషన్ సైతం స్పందించిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post