దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని దేవాలయాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంజూరుకు కృషి చేసిన మంత్రి సీతక్క  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
 మంత్రి సీతక్క  కృషితో మంజూరైన నిధులు 
సీజీఎఫ్ నిధుల నుంచి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ
గోవింద‌రావుపేట మండ‌లం బుస్సాపూర్ జానకి రామాల‌యానికి రూ.12 ల‌క్ష‌లు, కొత్త‌గూడ మండ‌లం గుంజేడు ముస‌ల‌మ్మ ఆల‌యానికి రూ. 50 ల‌క్ష‌లు..
 ములుగు మండ‌లం జ‌గ్గ‌న్న‌పేట పుట్టా మ‌ల్లిఖార్జున స్వామి దేవాల‌యానికి రూ.30 ల‌క్ష‌లు, మ‌ల్లంప‌ల్లి లోని వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యానికి రూ.20 ల‌క్ష‌లు, ములుగు ప‌ట్ట‌ణంలోని నాగేశ్వ‌ర స్వామి దేవాల‌యానికి రూ.20 ల‌క్ష‌లు, రామాల‌యానికి రూ.10 ల‌క్ష‌లు మంజూరు..
త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలిచి అభివృద్ది ప‌నులు అప్ప‌గించ‌నున్న అధికారులు..
నిధులు మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ‌ మంత్రి కొండా సురేఖ మరియు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు సీతక్క 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post