ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్‌, బోర్ తుపాకీ, మెడిసిన్ తదితర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post