నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా

పసుపు రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని మోదీ నెరవేర్చారన్న అమిత్ షా..
దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని స్పష్టం
నిజామాబాద్‌ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారని కేంద్రమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్‌ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. నిజామాబాద్‌ రైతులు పండించిన పసుపు భవిష్యత్‌లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుందన్నారు. పసుపుబోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని ఆయన చెప్పారు. భారత్‌ ఆర్గానిక్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌ కూడా నిజామాబాద్‌లోనే ఏర్పాటవుతున్నాయని వివరించారు. భారత్‌ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌తో నిజామాబాద్‌ పసుపు అమెరికా, యూరప్‌కు ఎగుమతి అవుతుందని అమిత్ షా వెల్లడించారు.
 తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం...
తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుందని అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ విజయం ఖాయమైందని తెలుస్తోందని వివరించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌కు పసుపుబోర్డు సాధించారని చెప్పారు. పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నామని అమిత్ షా వెల్లడించారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా చేసి చూపిస్తారని ఆయన అన్నారు.
 దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం..
మావోయిస్టులు (నక్సలైట్లు) తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. ‘పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్‌ మనల్ని భయపెట్టాలని చూసిందని ఆ తర్వాత భారత్‌ శక్తి ఏమిటో ఆదేశానికి, ప్రపంచానికి తెలిసింది అని అమిత్షా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా? మీరే చెప్పండని* అక్కడ ఉన్న సభికుల్ని ఉద్దేశించి అమిత్ షా అన్నారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కోరారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని, వారంతా జన జీవన స్రవంతిలోకి వచ్చేసినట్లు గుర్తుచేశారు.బీఆర్ఎస్ పై మండిపడిన అమిత్ షా..
బీఆర్ఎస్ సర్కార్‌ అవినీతికి పాల్పడిందా? లేదా? అని ప్రజలను అమిత్ షా ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌, కాళేశ్వరం ఇలా అనేక అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను దిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ, అవినీతి పోలేదుఅని అమిత్‌ షా అన్నారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, లక్ష్మణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కార్యాక్రమానికి హాజరయ్యారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post