దామెర పీహెచ్సీ వైద్య సిబ్బంది కొరతపై బీజేపీ మండల శాఖ ఆందోళన – DMHO వినతిపత్రం సమర్పణ

హనుమకొండ జిల్లా: దామెర
మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గురుజాల శ్రీరామ్ రెడ్డి, బత్తుల సుమంత్ కలిసి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) డాక్టర్ అప్పయ్య కలుసి వినతిపత్రం సమర్పించారు. దామెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో వైద్య సిబ్బంది కొరత వల్ల ప్రజలకు తగిన వైద్య సేవలు అందకపోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ పీహెచ్సీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సిబ్బంది:
డా. మంజుల – మండల వైద్యాధికారి
లీల – పబ్లిక్ హెల్త్ నర్స్ (PHN)
కరుణ రాణి – స్టాఫ్ నర్స్
శరత్ బాబు – ఫార్మాసిస్ట్
సుప్రజ – ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్
వెంకటేశ్వర్లు – MPHW (Male)
ఒక అటెండర్
10 ANMల పోస్టుల్లో కేవలం 5 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అందులో 2 మంది డిప్యుటేషన్‌పై ఉన్నారు. మిగిలిన 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ:
"గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ప్రజల నమ్మకం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లి అధిక ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఇది రైతులకు, కూలీ వర్గాలకు తీరని భారం. తక్షణమే సిబ్బంది నియామకం చేపట్టకపోతే, దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం తీసుకునే అజాగ్రత్తకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ఇది కేవలం పార్టీ లేదా రాజకీయాల విషయం కాదు — ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయమని ప్రభుత్వం గుర్తించాలి" అని హితవు పలికారు.
ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని నాయకులు తెలిపారు.DMHO డాక్టర్ అప్పయ్య గారు సమస్యను సానుకూలంగా స్వీకరించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన సిబ్బంది నియామకానికి తాము ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post