ప్రాధాన్యత కార్యక్రమాల అమలు లో కలెక్టర్ లు కీలక పాత్ర పోషించాలి:: సీఎం రేవంత్ రెడ్డి

పేదలకు చుట్టంలా భూ భారతి చట్టం పని చేస్తుంది
ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలి
అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలి
మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా
జూన్ 3 నుండి జూన్ 20 వరకు అన్ని రెవిన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
నకిలి విత్తనాల అమ్మే వారి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలీ
వానాకాలం ముందస్తు సాగు రైతులను సన్నద్దం చేయాలి
వానాకాలం పంట సాగుకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చర్యలు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పంట వివరాలు సమర్పించాలి
ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ శాఖ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎంప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు లో కలెక్టర్ లు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ శాఖ వంటి పలు అంశాల పై సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ కి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐడిఓసి నుండి పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గతం కంటే దాదాపు 22 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ తక్కువ సమయంలో కొనుగోలు పూర్తి చేయడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. 90 శాతం పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి రుతు పవనాలు ముందుగా వచ్చిన కారణంగా కల్లాల వద్ద ధాన్యం తడిసిపోవడంతో కొంత మంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేశామని అన్నారు. 10 లక్షల 50 వేల మంది రైతుల దగ్గర్నుంచి 64 లక్షల మెట్రిక్ టన్నుల పైగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేశామని, ప్రభుత్వం చేసిన మంచి పనిని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు బలంగా జరుగుతున్నాయని, వీటిని తిప్పికోట్టాల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. జిల్లాలో వచ్చే వ్యతిరేక వార్తలలో సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల పై ఉందని అన్నారు. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలతో కలెక్టర్ రెగ్యులర్ గా సర్క్యులేట్ చేయాలని సీఎం ఆదేశించారు.జిల్లాలో ఉన్న రైస్ మిల్లులను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలని సీఎం సూచించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల పరిహారం అందించేందుకు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి తెలిపారు.వర్షాలు ముందుగా రావడం వల్ల వ్యవసాయ శాఖ ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలని, రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉండాలని అన్నారు. విత్తనాల, ఎరువులు అక్రమ స్టాక్ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలి విత్తనాల అమ్మే వారి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అన్నారు.భూ భారతి చట్టం ముందస్తుగా 4 పైలెట్ మండలాలను ఎంపిక చేసుకున్నామని, అనంతరం ప్రతి జిల్లాలో ఒక మండలానికి పైలట్ గా ఎంపిక చేసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ప్రజల నుండి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ ప్రజలను భూతంలా పీడించిందని, భూ భారతి చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుందని సీఎం తెలిపారు. 
పైలెట్ మండలాలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. జూన్ 3 నుంచి జూన్ 20 వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు అన్ని మండలాలలో నిర్వహించాలని, దీనికి కార్యాచరణ సిద్దం చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సులలో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించడంతో పాటు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించాలని ‌అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ప్రభుత్వ పనితీరు కనిపిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ లు పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు పర్యవేక్షించాలని అన్నారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను కలెక్టర్లు నియమించాలని, మేస్త్రీ చార్జిలు, నిర్మాణ పరికరాల ధరల నియంత్రణ ఉండాలని, అడ్డుగోడలు ధరలతో పేదలను మోసం చేయకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. 
ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్దిదారులకు టోకెన్ జారీ చేసి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అన్నారు. అక్రమ ఇసుక రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రోత్సహించే ఆస్కారం లేదని, ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక దోపిడీ జర్గకుండా జాగ్రత్త వహించాలని సీఎం సూచించారు. మహిళా సంఘాలు, యువత ద్వారా రాజీవ్ యువ వికాసం ద్వారా ఇటుక, సెంట్రింగ్ యూనిట్ల తయారీ కేంద్రాల ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు.తక్కువ ధరతో నాణ్యమైన ఇండ్లు నిర్మాణం చేసేందుకు అనేక సాంకేతిక కొత్త పద్ధతులు వచ్చాయని , వీటిని లబ్ధిదారులకు తెలియజేయాలని సీఎం తెలిపారు. మండల కేంద్రాలల్లో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల పరిశీలించేలా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం తెలిపారు.
జిల్లా కలెక్టర్లు, ఇంచార్జి మంత్రులు మే 29, 30 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం సాగు ఏర్పాట్లు, నకిలీ విత్తనాలు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్ల, భూ భారతి పై రిపోర్టు తయారు చేసి జూన్ 1 నాటికి సమర్పించాలని అన్నారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. జిల్లాలో ముందస్తు సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మే 26, 2025 నాటికి యాసంగి సీజన్ లో ప్రభుత్వం 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, గత సంవత్సరం యాసంగి లో కొనుగోలు చేసిన ధాన్యం కంటే 22 లక్షల మెట్రిక్ టన్నుల అధికంగా కొనుగోలు చేయడం పట్ల మంత్రి అధికారులకు అభినందనలు తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకుందని, అకాల వర్షాల కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం వచ్చే అవకాశం ఉందని, వీటిని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు.ధాన్యం రవాణా నిమిత్తం సమస్యలు రాకుండా రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి అవసరమైన వాహనాలు అందుబాటులో పెట్టాలని, రైస్ మిల్లర్లు సహకరించని పక్షంలో ఇంటర్మీడియట్ గోదాములకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఎక్కడా హామాలీల కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ధాన్యం చెల్లింపులు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసిన 48 గంటల లోగా పూర్తి చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశం పై ఎటువంటి వ్యతిరేక వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తను విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, తప్పుడు వార్తలు ప్రచారంలో ఉంటే వెంటనే ఖండించాలని మంత్రి ఆదేశించారు.రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పైలెట్ ప్రాజెక్టు కింద మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లలో 15 శాతం మాత్రమే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన ఇండ్ల పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.    ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇందిరమ్మ ఇండ్లలో పైలెట్ గ్రామాల్లో మంజూరు చేసిన ఇండ్లు మినహాయించి మిగిలిన ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఇప్పటి వరకు లక్షా 30 వేల మంది లబ్ధిదారులను అర్హులుగా ఎంపిక చేసినట్లు రిపోర్ట్ ఉందని మంత్రి తెలిపారు.భూ భారతి చట్టం కింద పైలెట్ మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించి జూన్ 2 నాడు పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు. అసైన్మెంట్ భూముల సంబంధించి విక్రయం జరిగిన భూముల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాల ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లకు జిల్లాల్లో శిక్షణ అందించే కార్యక్రమం ప్రారంభించామని, ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, మే నెలలోనే వర్షాలు రావడం చాలా సంతోషకరమని అన్నారు. వానాకాలం పంట సాగు వ్యవసాయ శాఖ సన్నద్దం కావాలని, విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి విత్తనాల విక్రయం పర్యవేక్షించాలని, ఎక్కడా నకిలీ విత్తనాలు అమ్మకం జరగొద్దని కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ, రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో పెండింగ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ లకు సూచించారు.
 వానాకాలం పంట సాగు కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, అకాల వర్షాల నుంచి రైతులను కాపాడేందుకు ముందస్తు సాగు ప్రోత్సహించాలని అన్నారు. 
అనతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. గత యాసంగి కాలంలో మొత్తం 35,570 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, కాగా ఈ సంవత్సరం యాసంగి కాలంలో ఇప్పటి వరకు ఇప్పటికే 62,209 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు రూ. 37 కోట్ల 26 లక్షల చెల్లింపులు విజయవంతంగా పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు, మండల స్థాయి బృందాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిఎస్ఓ శ్రీనాథ్, డి ఆర్ డి ఓ నరేష్, డిఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్, హార్టికల్చర్ అధికారి సునీల్, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, వ్యవసాయ శాఖ ఏడీఏ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post