భారతదేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.దేశంలో 1,828 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది కరోనాతో మృతి చెందారు.* అందులో ఆరుగురు మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు. గుజరాత్లో గురువారం ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో 8 నెలల శిశువు కూడా ఉంది. ప్రస్తుతం ఆ శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేరళలో మొత్తం 727 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఓమిక్రాన్ JN వేరియంట్ LF7 కేసులు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి విజయన్ ధృవీకరించారు.దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా
జనవరి నుంచి మహారాష్ట్ర కోవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం ఇప్పటి వరకు 9,500 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. *గురువారం ఒక్క రోజే 79 కొత్త కేసులు నమోదు* అయినట్లు తెలుస్తోంది. ముంబైలో 373 కేసులు పెరిగాయి. జమ్మూ & కాశ్మీర్లో గురువారం రెండు కొత్త కేసులు నిర్ధారించారు. అటు ఏపీలోనూ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా క్రమంగా కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి.
కరోనాలో అనేక కొత్త రకాలు వస్తున్నాయని WHO ఇటీవల తెలిపింది. వీటిలో NB.1.8.1, JN.1, KP.2 వంటి వేరియంట్లు ఉన్నాయి. ఇవి ఓమిక్రాన్ వేరియంట్లు. NB.1.8.1 వేరియంట్ ప్రస్తుతం చైనా, అమెరికా తోపాటు కొన్ని యూరోపియన్ దేశాలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. అదే సమయంలో, భారతదేశంతో సహా అనేక దేశాలలో కరోనా NB.1.8.1, LF.7 రెండు ఉప-వేరియంట్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Post a Comment