శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. 
విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజాదికాలు జరిపారు.వేకువ జాముని భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.తెలుగు సంవత్సరాది సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో పూజారి బలబత్తుల రాజ్ కుమార్ అర్చకుడిచే నూతన తెలుగు సంవత్సరాది పంచాంగ శ్రవణం నిర్వహించారు.భక్తులు పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొని నూతన తెలుగు సంవత్సరంలో తమ యొక్క జాతక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post