బాధిత కుటుంబానికి ఎల్పోసీ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని వెంకటేష్ రోడ్డు ప్రమా దంలో గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇట్టి విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు భూపా లపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందిం చిన ఎమ్మెల్యే నిమ్స్ ఆసుపత్రి, సెక్రటేరి యట్ అధికారులతో మాట్లాడారు. గంటల వ్యవధిలోనే ప్రభుత్వం నుండి రూ.1,30, 000/- ల విలువైన చెక్కును మంజూరు. చేపించి, బాధిత కుటుంబ సభ్యులకు ఈరో జు బుధవారం సాయంత్రం సెక్రటేరియట్
లో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, నిరుపేద కుటుంబాలకు నాణ్యమైన వైద్య సాయం అందించేందుకు ఎల్వోసీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post