నాంపల్లి ఏసీబీ కోర్టు తీర్పు

నిజామాబాద్, : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసులో నిజామాబాద్ జిల్లా కోటగిరి కార్యదర్శికి ఏడాది జైలుశిక్ష, రూ.40వేల జరిమానా విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏసీబీ డీఎస్పీ శేఖరౌడొలిపిన ప్రకారం... కోటగిరి మండల కేంద్రానికి చెందిన వడ్డే లింగయ్య మరణించగా ఇద్దరు కొడుకుల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి. తండ్రి పేరుతో ఉన్న ఇంటిని సోదరుడి పేరుతో మార్చమని వడ్డే నర్సింహులు 2014లో పంచాయతీ కార్యదర్శి సుదర్శన్కు దరఖాస్తు ఇచ్చాడు.రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా.. రూ.8 వేలకు కుదుర్చుకుని నర్సింహులు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటుండగా కార్యదర్శి సుదర్శన్ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేసింది.
నిందితుడికి నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి మహ్మద్ఫ్రోజ్ అక్తర్ఎడాది జైలు శిక్ష, రూ.40 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఫైన్ కట్టలేకుంటే అదనంగా నెల రోజులు జైలులో నిందితుడు ఉండాలని ఆదేశించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post