ఆర్థిక సాయం బియ్యం అందించిన టెన్త్ క్లాస్ బ్యాచ్.
శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఇటీవల తీవ్ర అనారోగ్యంతో అకాల మరణం చెందిన మాదారపు రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన పదవ తరగతి 2000 సంవత్సరం బ్యాచ్ స్నేహితులువారి కుటుంబానికి 25కిలోల బియ్యం మరియు ఆర్థిక సాయం అందించారు.
కడు బీదరికంలో ఉన్న రమేష్ కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని మిత్రులందరుకలిసి తమ వంతు సహకారం అందించాలని ఆలోచించారు, అందరూ ఆర్థికంగా స్పందించి ఈరోజు దశదినకర్మ సందర్భంగా వారి కుటుంబానికి ₹20వేల రూపాయలు మరియు 25కిలోల బియ్యాన్ని వారి కుటుంబానికి అందజేశారు
ఇంకా ఎలాంటి సాహయసాకారమైన అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పిల్లలు గుండె ధైర్యంతో ఉండాలని మనోధైర్యం నింపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులు ఎస్.కె గౌస్, గోల్కొండ బుచ్చన్న, ఆకుతోట పూర్ణచందర్, మోకిడే మహేందర్, బయగాని సురేందర్, బయగాని రాజు, చింతనిప్పుల రమేష్, నూటంకి సతీష్, పోతు సుమలత రమణారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment