అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, ఇసుక అక్రమ రవాణా పై నిరంతర పర్యవేక్షణ



 జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే IPS
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే IPS అన్నారు. సోమవారం మహాదేవ్ పూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీతో  పాటు కాటారం మండలం మద్దులపల్లి చెక్ పోస్ట్ ను  ఎస్పి  ఆకస్మిక తనిఖి చేపట్టారు. ఈ సందర్భంగా క్వారీలో గల ఇసుక నిల్వలపై ఆరా తీసి, క్వారీ ఆఫీసులో  ఉన్న  రికార్డు పుస్తకాలను పరిశీలించినారు. క్వారీలో  ఎటువంటి అక్రమాలకు పాల్పడిన, జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యం స్దానం లాంటి ఉల్లంఘన లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  జిల్లాలో అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దాడులు నిర్వహిస్తోందని, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పి  తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (PDPP) చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టం (Mines and Minerals Act) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పి  హెచ్చరించారు. 
ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతంలోనే రాయల్టీ రుసుము చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని, తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్ట పరంగాచర్యలు తీసుకుంటామని ఎస్పి కిరణ్ ఖరే  హెచ్చరించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post