BLN తెలుగు దినపత్రిక హనుమకొండ: హనుమకొండ నగరంలోని
కిషన్ పూర్ లో ఉన్న ఆర్ డీ మహిళా జూనియర్ కాలేజీలో 25 మంది మహిళా విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ అయింది. ఈ విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం కాలేజీ హాస్టల్లో తిన్న ఆహారంపాయిజన్ అయింది. ఈ విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం మధ్యాహ్నం కాలేజీ హాస్టల్లో తిన్న ఆహారం వికటించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని గ్రహించిన ఆర్డీ మహిళా జూనియర్ కాలేజీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యం అనంతరం కాలేజీ యాజమాన్యం ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయికి ఫివర్ వచ్చింది, వచ్చి తీసుకెళ్లండి అని సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కొంత మంది వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.అనంతరం ఇంటికి వెళ్లిన విద్యార్థినిలు కడుపు నొప్పితో బాధపడుతుండగా అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే వైద్య చికిత్స కోసం హనుమకొండలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విద్యార్థినుల బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ అయిన కాలేజీ హాస్టల్ నుండి ఆర్డీమహిళా జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు అందరినీ కాలేజీకి సంబంధించిన మరో క్యాంపస్ కి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులు కొంత మంది ఇంటికి వెళ్లకపోవడంతో శుక్రవారం కూడా కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి మీ పిల్లలను తీసుకెళ్లండి అంటూ సమాచారం ఇచ్చినట్లు పలువురు విద్యార్థినిలు తెలిపారు.ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థినిలను శుక్రవారం ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. అనంతరం కాలేజీ ముందు ధర్నాకు దిగారు. అధికారులు స్పందించి ఇలాంటి కాలేజీలను మూసివేయాలని డిమాండ్ చేశారు. దీనిపై వివరణ కోసం ఆర్డీ మహిళా జూనియర్ కాలేజీ డైరెక్టర్ మల్లేష్ ను అడగగా తమ కాలేజీలో అటువంటిదేమీ జరగలేదని సమాధానం ఇచ్చారు. కాలేజీ ముందు ధర్నా చేసిన వారిలో బీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్, టీజీవీపీ నాయకుడు మేడ రంజిత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకు ప్రవీణ్, సుభాష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment