బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్ కు చేరుకున్నారు.
తన డిప్లమాటిక్ పాస్పోర్ట్ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ను తీసుకునేందుకు కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చారు.ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కేసీఆర్ సికింద్రాబాద్ లోని పాస్ పోర్టు కార్యాలయంలో పాస్ పోర్టు రెన్యువల్ పని కోసం వెళ్లారు.
అనంతరం నందినగర్ లోని తన నివాసానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకొని పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. *వచ్చె నెలలో కేసీఆర్ అమెరికా వెళ్లి తన మనమడు హిమాన్షుతో కొన్ని రోజులు గడిపేందుకు పాస్ పోర్టు రెన్యువల్ చేయించుకున్నారని సమాచారం
అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డిసికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్ కు కేసీఆర్ వెళ్లడాన్ని ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. కాసేపట్లో సికింద్రాబాద్ పాస్ పోర్టు ఆఫీస్ కు కేసీఆర్ వెళ్లనున్నారంటూ.పాస్ పోర్టు శేఖర్..పాస్ పోర్టు కార్యాలయానికి దేనికోసం వెలుతున్నారంటూ? సామ తన ట్వీట్ లో ప్రశ్నించారు.
పరారైన మాజీ డీఐజీ ప్రభాకరరావు స్ఫూర్తి అయితే కాదు కదా? అంటూ సామ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో సామా ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Post a Comment