కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. బీహార్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కొరకే కేంద్ర బడ్జెట్. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

BLN తెలుగు దినపత్రిక భూపాలపల్లి, 1 ఫిబ్రవరి 2025
ఈరోజు(శనివారం) పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, బీజేపీ బీహార్ లో ఎన్నికల కోసమే బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* ఎద్దేవా చేశారు. ఈరోజు సాయంత్రం భూపాలపల్లి లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం నుండి వీడియోను మీడియాకు విడుదల చేశారు. తెలుగు మహిళ అయిన నిర్మలా సీతరామన్ కేంద్రంలో వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిందని, తెలుగు వారి కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని అన్నారు. తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధాని, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ హోదా, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదని బీజేపీ వివక్ష చూపడం సరికాదన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post