క్లాస్ రూమ్ లోనే స్టూడెంట్తో మహిళా ప్రొఫెసర్ పెళ్లి.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..!

పశ్చిమ బెంగాల్ లోని నదియాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అప్లైడ్ సైకాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి.. ఏకంగా తన ప్రొఫెసర్కే సింధూరం పెట్టాడు. ఇద్దరూ పూలదండలు కూడా మార్చుకున్నారు. క్లాస్లూమ్లోనే ఈ పెళ్లి తంతు జరగడంతో అందరూ షాక్ అయ్యారు. దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆ ప్రొఫెసర్ మాత్రం ఇది నిజమైన పెళ్లి కాదని అంటున్నారు. అదంతా ఒక అకడమిక్ ప్రాజెక్ట్లో భాగమని చెప్పారు. కానీ, ఆ ప్రాజెక్ట్ ఉద్దేశమేంటో మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు. ఈ ఘటనపై యూనివర్సిటీ సీరియస్గా స్పందించింది. ప్రొఫెసర్ను సెలవుపై పంపి విచారణకు ఆదేశించింది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post