పశ్చిమ బెంగాల్ లోని నదియాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అప్లైడ్ సైకాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి.. ఏకంగా తన ప్రొఫెసర్కే సింధూరం పెట్టాడు. ఇద్దరూ పూలదండలు కూడా మార్చుకున్నారు. క్లాస్లూమ్లోనే ఈ పెళ్లి తంతు జరగడంతో అందరూ షాక్ అయ్యారు. దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆ ప్రొఫెసర్ మాత్రం ఇది నిజమైన పెళ్లి కాదని అంటున్నారు. అదంతా ఒక అకడమిక్ ప్రాజెక్ట్లో భాగమని చెప్పారు. కానీ, ఆ ప్రాజెక్ట్ ఉద్దేశమేంటో మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు. ఈ ఘటనపై యూనివర్సిటీ సీరియస్గా స్పందించింది. ప్రొఫెసర్ను సెలవుపై పంపి విచారణకు ఆదేశించింది.
క్లాస్ రూమ్ లోనే స్టూడెంట్తో మహిళా ప్రొఫెసర్ పెళ్లి.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..!
byBLN TELUGU NEWS
-
0
Post a Comment