నన్ను బచ్చా గాడని ఎమ్మెల్యే అంటున్నాడని,దమ్ముంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తే బచ్చాగాడు ఎవరో, లుచ్చాగాడు ఎవడో తేల్చుకుందామంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

పరకాల : నన్ను బచ్చా గాడని ఎమ్మెల్యే అంటున్నాడని,
దమ్ముంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తే బచ్చాగాడు ఎవరో, లుచ్చాగాడు ఎవడో తేల్చుకుందామంటూ పరకాల ఎమ్మెల్యే రేవూరిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై, స్థానిక ఎమ్మెల్యే రేవూరిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. పరకాల ప్రజల కోసం నన్ను బచ్చా అన్నా.. లుచ్చా అన్నా పడతాను కానీ పరకాల ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోనని అన్నారు.ఎమ్మెల్యే కు దమ్ముంటే సంవత్సర కాలంలో పరకాల నియోజకవర్గంలోని మార్క్ ఏంటో చెప్పాలని అన్నారు. కల్యాణ లక్ష్మిలో రేషన్ కార్డుల మంజూరీకి లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్ల పాలనలో నేను కానీ నా పార్టీ నేతలు కానీ పైసలు తీసుకోలేదని అన్నారు. కానీ మీరు ఇల్లు కడితే పైసలు అడుగుతున్నారని, కళ్యాణ లక్ష్మీకోసం అడుగుతున్నారు. వీటిని మా పార్టీ శ్రేణులు అడ్డుకుంటారని, ఇప్పటితో ఆగకపోతే రోజూ ఆధారాలతో పత్రికలకు, ఎలక్ట్రానిక్ హెచ్చరించారు. మీడియాకు అందజేస్తామనిదమ్ముంటే చర్చకు రా.. రేవూరి..!
పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు. పరకాల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏడాది పాలనపై చర్చిద్దాం రా అంటూ వ్యాఖ్యనించారు. ఏడాది కాలంలో నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చర్చకు రావాలని అన్నారు. నేను గతంలో తీసుకొచ్చిన వంద పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేవూరి ఆపించేశారని ఆరోపించారు. పరకాలలో మంజూరు చేయించిన రోడ్లను నిర్మించకుండా అడ్డుకొని పనులు రద్దు చేశారని అన్నారు. పరకాల పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎలా పెడతాడని ఎమ్మెల్యే రేవూరిని ఉద్దేశించి ప్రశ్నించారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్య పెట్టి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మాయ మాటలు చెబుతోందనన్నారు.ఏడాది కాలంగా ప్రజలకు ఆ పార్టీ చేసిందేంలేదని, ప్రజలను అరిగోస పెడుతోందన్నారు. ఏడాదిలోపే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు నచ్చక సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామ సభల్లో ఎదురు తిరుగుతున్నారని అన్నారు. గత ప్రజాపాలనలో డెబ్బై ఆరు ప్రశ్నలతో ఇంటింటికి తిరిగి సర్వే చేశారని, పథకాలను అమలు చేసే ఉద్దేశమే ఉంటే ఆ డేటా సరిపోదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడేమో మళ్లీ గ్రామ సభల పేరుతో మళ్లీ దరఖాస్తులు తీసుకోవడం కాలయాపన చర్యచేనని అన్నారు. గ్రామ సభల్లో ప్రశ్నించే ప్రజలను అడ్డుకుంటున్న దృశ్యాలను మనందరం చూస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే ఎమ్మెల్యేలు గ్రామ సభల్లో పాల్గొనడం లేదని ఎద్దేవా చేశారు. వరంగల్ లో ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ మా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇండ్లు ఇస్తామని చెప్పడం ఈ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకంలో అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తెచ్చి వాటిని ఆపేశారంటూ గుర్తు చేశారు. లబ్దిదారులు అందరూ హైకోర్టుకు వెళ్తే కోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేస్తూ వాళ్లకి ఇండ్లను ఇవ్వమని ఆదేశించిందని అన్నారు.హైకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు బంధును బొందపెట్టి రైతు భరోసాకు రాం.. రాం చెప్పారని అన్నారు. తాము సిద్ధం చేసిన రైతుబంధు రూ.7500 కోట్లను ఎవరికిచ్చారో ముఖ్యమంత్రి ప్రజలకు లెక్కలు చెప్పాలని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి తూ తూ.. మంత్రంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి మిగతా హామీలను పక్కన పెట్టేశారని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ మార్కెట్ చైర్మన్ లు, సొసైటీ చైర్మన్లు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post