ప్రయాగ్రాజ్ చేరుకోవడం ద్వారా, లారెన్ పావెల్ జాబ్స్.. తన భర్త స్టీవ్ జాబ్స్ కోరికను నెరవేర్చారు. ఎందుకంటే *1974లోనే స్టీవ్ జాబ్స్ కుంభమేళాను సందర్శించాలని అనుకున్నారు.* ఆ క్రమంలో తన ప్లాన్ గురించి రాసిన చేతిరాత లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. *ఆ లేఖను వేలం వేయగా రూ. 4.32 కోట్లకు (US$500312.50) అమ్ముడైంది.* ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ స్నేహితుడు టిమ్ బ్రౌన్ వెల్లడించారు.ఆ ఉత్తరం ఎంతకు అమ్ముడైంది?*
స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన లేఖలో ఆయన ఆధ్యాత్మికత విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు జాబ్స్ వేలం వేసిన మొదటి వ్యక్తిగత లేఖ ఇదే కావడం విశేషం. దీంతో ఈ లేఖకు డిమాండ్ ఎక్కువగా ఏర్పడింది. వేలం వేయగా US$500,312.50 (రూ. 4.32 కోట్లు)కు సేల్ అయ్యింది. స్టీవ్ జాబ్స్ బాల్య స్నేహితుడు టిమ్ బ్రౌన్ 19వ పుట్టినరోజున ఆయనకు రాసిన లేఖలో జాబ్స్ బౌద్ధమతం గురించి ప్రస్తావించారని తెలిపారు. దీంతోపాటు భారతదేశంలో జరిగే కుంభమేళాకు హాజరు కావాలనే తన ఆశను పంచుకున్నారని చెప్పారు. *ఈ లేఖను స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్తో కలిసి ఆపిల్ను స్థాపించడానికి కేవలంరెండు సంవత్సరాల ముందు రాశారు.ఆ లేఖలో ఏం రాసి ఉంది?*
నివేదికల ప్రకారం ఆ లేఖలో స్టీవ్ జాబ్స్.. బ్రౌన్ రాసిన లేఖకు ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆయన ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. చాలాసార్లు ఏడ్చానని లేఖలో చెప్పారు.ఏప్రిల్లో ప్రారంభమయ్యే కుంభమేళాకు తాను భారతదేశానికివెళ్లాలనుకుంటున్నానని* అన్నారు. మార్చిలో వెళ్తాను, కానీ దాని గురించి ఇంకా ఖచ్చితంగా తెలియదన్నారు. ఈ క్రమంలో జాబ్స్ ఇప్పటికే హిందూ మతం ద్వారా బాగా ప్రభావితమైనట్లు అనిపిస్తోంది. ఆ క్రమంలోనే *అక్టోబర్ 5, 2011న 56 ఏళ్ల వయస్సులో స్టీవ్ జాబ్స్ మరణించారు.
Post a Comment