రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ

అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ

శాయంపేట మండలంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చెయ్యడం దేశంలోనే ప్రధమం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని మండల లోని అన్ని గ్రామాల్లో పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని రేషన్ షాప్ యజమాని పంపిణీ చేశారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేశారు. మండల కేంద్రంలోని 30 రేషన్ షాపుల ఆధారంగా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చిరంజీవి, శివాజీ, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, రఘుపతి, సాంబయ్య, మాజీ సర్పంచ్ సతీష్, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post