వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లే దేవాదుల ప్రాజెక్టులో మోటార్ల విడుదలకు ఆదేశాలు వచ్చాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిని నిండుకుండలు చేసిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ఆరోపణలుకాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక ఎకర భూసేకరణ కూడా జరగలేదని, దేవాదుల ప్రాజెక్టు డెడ్లైన్లు మారుతున్నా పనులు స్థిరంగా లేవని హరీష్ రావు ఆరోపించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు నిధులు గతంలోనే సమకూర్చామని, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఇప్పటికే ప్రారంభించేవాళ్లమని చెప్పారు.ఎంజీఎం హాస్పిటల్లో ఆక్సిజన్ మెషిన్లు పనిచేయకపోవడం, మందుల కొరత, వైద్యుల కొరత వంటి సమస్యలు ఉన్నాయని, గుండె శాస్త్ర చికిత్సలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలుహరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చంద్రబాబుకు దాసోహమైనట్లు, అసెంబ్లీలో మైక్ తిప్పకుండా మాట్లాడే ధైర్యం లేనట్లు విమర్శించారు. హెల్త్ సిటీ ఆలోచన కేసీఆర్దని, యూచర్ సిటీలా కొత్తగా చెప్పుకోవద్దని, జూన్ 2 తేదీన హాస్పిటల్ ప్రారంభం గురించి OP సేవలు మాట్లాడటం బస్తీ దవాఖానలా అని ప్రశ్నించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు PRC బకాయిలు చెల్లించాలని, జర్నలిస్టుల హెల్త్ కార్డులు తొలగించాయని ఆరోపించారు.బీఆర్ఎస్ డిమాండ్లుగత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి పనినీ పూర్తి చేయాలని, హాస్పిటల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే ధర్నాకు దిగుతామని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు MGM హాస్పిటల్ సందర్శించకపోవడం, కాంగ్రెస్ ఆగడాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ఈ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ పక్షం స్పష్టం చేసింది.
తన్నీరు హరీష్ రావు వరంగల్ సందర్శన వివరాలుమాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment