ఉమ్మడి వరంగల్ జిల్లాశాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శనివారం ఘనంగా ప్రారంభం అయినాయి ఈరోజు అంకురారోహణము విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన పూజ యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాలాచార్యులు అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి పూజ హోమం నిర్వహించినారు అనంతరం ద్వజారోహం గరుడ పటం ఎగరవేసినారు తర్వాత గరుడ ముద్ర ప్రసాదాలు సంతానం లేని దంపతులకు భక్తులకు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్సేనారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేశ్వరరావు వినుకొండ శంకరాచారి దిండిగాల వంశి మామిడి ప్రమోద్ కంబత్తుల ప్రకాష్ హోంగార్డ్ మంత్రి చందు గిద్దమారి సురేష్ నడిగట్టు సాంబయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఘనంగా ప్రారంభమైన మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు..
byBLN TELUGU NEWS
-
0
Post a Comment