హనుమకొండ జిల్లా.పరకాల కౌన్సిలర్లను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే చల్లా

పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్ల పదవీకాలం శనివారంతో ముగియగా ఆదివారం రోజున హనుమకొండలోని వారి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను,కో అప్షన్లను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు మీపై నమ్మకంతో గెలిపించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిస్వార్ధంగా,పారదర్శకంగా ఐదేళ్లు సేవలందించిన కౌన్సిలర్లను అభినందించారు.పదవి ఉన్న లేకున్నా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు.పరకాల పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని కోరారు.కాంగ్రేస్ ప్రభుత్వం వైఫల్యాలను,మోసాలను ప్రజలకు తెలియచేయాలన్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని,మరోసారి పరకాల మున్సిపాల్టీపై గులాబీ జెండా ఎగరవేయాలన్నారు.ఈ కార్యక్రమాలో వైస్ చైర్మన్,కౌన్సిలర్లు,కో ఆఫ్షన్లు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post